సమంత.. ఈ బ్యూటీ గురించి ఎటువంటి పరిచయాలు అవసరం లేదు. రీల్ లైఫ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా ముద్ర వేయించుకున్న ఈమె.. రియల్ లైఫ్లో మాత్రం గెలవలేకపోయింది. చైతుతో విడిపోయిన తర్వాత కెరీర్పై మరింత ఫోకస్ పెట్టిన సామ్.. రీసెంట్గా బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో స్టార్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి పాల్గొంది.
ఈ సీజన్కు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్నాడు. తాజాగా సమంత-అక్షయ్ కుమార్లు పాల్గొన్న ఎపిసోడ్ సైతం స్ట్రీమింగ్ అయింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ షోలో హోస్ట్ కరణ్ జోహార్.. సమంతను వృత్తిపరమైన విషయాల గురించే కాకుండా వ్యక్తిగత విషయాలను గురించి సైతం ప్రశ్నలు వేశాడు.
రిస్క్ వద్దనుకుంటున్న సమంత.. ఆ పోటీ నుంచి ఔట్..?!
ఆ ప్రశ్నలకు సమంత కాస్త ఇబ్బంది పడినా.. ఓపిగ్గా సామాధానాలు ఇచ్చింది. ఇక ఈ క్రమంలోనే రాంచరణ్, అల్లు అర్జున్, ధనుష్, విజయ్ దేవరకొండల గురించి ఒక్క ముక్కలో చెప్పమని కరణ్ ప్రశ్నించగా.. సామ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. రాంచరణ్ అసలైన గ్యాంగ్ స్టర్ అని తెలిపింది.
అలాగే అల్లు అర్జున్ ఒక మ్యాజిక్ అని, ధనుష్ గ్లోబల్ స్టార్ అని తేల్చేసింది. ఇక విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. అతడు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అంటూ పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, సామ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో `ఖుషి` అనే మూవీ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!