ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఫాన్స్ కి బిగ్ షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `శాకుంతలం` ఒకటి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మించారు.
ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ పౌరాణిక చిత్రంలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అల్లు అర్హ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సమంత అభిమానులు ఎంతగానో సంబరపడ్డారు. కానీ అనూహ్యంగా విడుదల తేదీ వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఈ సినిమాను 3డీ ఫార్మాట్లో బెస్ట్ క్వాలిటీతో విడుదల చేయాలని గుణశేఖర్ టీం నిర్ణయించుకుందట. ఈ నేపథ్యంలోనే 3డీ ఫార్మాట్ పనుల కోసం మరింత సమయం పట్టనుండటంతో రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్రటీమ్ ప్రకటించింది. ఈ ప్రకటనతో సమంత ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
https://twitter.com/GunaaTeamworks/status/1575447526530224129?s=20&t=E4dxIrMvWH5wg7VFZCU0Gw