ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `యశోద`. హరి-హరీష్ కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
నవంబర్ 11న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా మేకర్స్ యశోద ట్రైలర్ను బయటకు వదిలారు. `మీకెప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా..? బిడ్డను కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది..` అనే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆథ్యంతం సూపర్ థ్రిల్లింగ్గా కొనసాగుతూ ఆకట్టుకుంది.
పేదరికంలో ఉన్న యశోద (సమంత) డబ్బు కోసం సరోగసి పద్దతిలో బిడ్డను కనివ్వడానికి అంగీకరిస్తుంది. యశోద మాదిరిగానే మరికొందరు మహిళలు కూడా సరోగసి ద్వారా బిడ్డను కనివ్వడానికి ఒప్పుకుంటారు. వీరందరినీ సకల వసతులు, వైద్య సౌకర్యాలు కల ఓ భవంతిలోకి తీసుకు వెళతారు. అక్కడ మొదట అంతా బాగానే ఉంటుంది. కానీ, కొద్ది రోజులకు కొన్ని అనుకోని సంఘటనలు యశోదలో పలు అనుమానాలను తలెత్తేలా చేస్తాయి.
ఆ తర్వాత ఏం జరిగింది..? ఆమె ఎలాంటి పరిణామాలను ఫేస్ చేసింది..? అన్న అంశాలను టచ్ చేస్తూ ఉత్కంఠగా ట్రైలర్ ను కట్ చేశారు. ఇందులో వరలక్ష్మి, ఉన్ని ముకుందన్ డాక్టర్స్గా, రావు రమేశ్ రాజకీయ నాయకుడిగా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘యశోద ఎవరో తెలుసు కదా.. ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి’ అంటూ సమంత చివర్లో చెప్పిన డైలాగ్ హైలెట్గా నిలిచింది. ఇక యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసింది. మొత్తానికి అదిరిపోయిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మరి లేటెందుకు మీరు కూడా ట్రైలర్పై ఓ లుక్కేసేయండి.