Samantha: హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం తెలిసిందే. సమంత స్వయంగా ఈ విషయాన్ని అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ప్రాణాంతకరా వ్యాధి కావడంతో పాటు మూడో దశలో… ఉండటంతో సమంత చికిత్స విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒప్పుకున్న సినిమాలను వదిలేసుకోవడం జరిగింది. కొద్ది నెలలపాటు ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ ఎలాగైనా కెమెరాలు ముందుకు రావాలని భావించిన సమంత… ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. విషయంలోకి వెళ్తే సమంత మరింత టైం తీసుకోవాలని సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందట.
ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒప్పుకున్న సినిమాల నిర్మాతలకు ఈ విషయాన్ని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సమంతకి బదులు వేరే ఆప్షన్ వెతికే పనిలో నిర్మాతలు పడ్డారట. చికిత్స విషయంలో మరింత టైం… పట్టి అవకాశం ఉండటంతో నిర్మాతలకు భారం కాకుండా సమంతకి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి, బాలీవుడ్ ఇండస్ట్రీలో “ది ఫ్యామిలీ మెన్” సెకండ్ పార్ట్ ఈ రెండు ప్రాజెక్టులు ఒప్పుకోవడం జరిగింది. ఖుషి సినిమా చాలా వరకు కంప్లీట్ అయింది. దీంతో మిగతా బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి ఇంకా పూర్తిగా లాంగ్ బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
ఈ నిర్ణయంతో సమంత ఇంకా సినిమాలు చేసే అవకాశం చాలా తక్కువే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సమంత నాగచైతన్యత విడాకులు తీసుకున్నాక కెరియర్ పరంగా మంచి బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించింది. పుష్ప, మీ ఫ్యామిలీ మెన్ లతో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటింది. మంచి సక్సెస్ ఫుల్ గా కెరియర్ కొనసాగుతున్న సమయంలో మయోసైటిస్ వ్యాధి… సమంత కి బ్రేక్ వేసింది. దాదాపు ఇంకా రెండు సంవత్సరాలు పాటు సమంత వెండితెరపై కనిపించే అవకాశం ఉండదని ఇది కచ్చితంగా ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.