Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప 2, విజయ్ వారసుడు ఇంకా పలు హిందీ మరియు తమిళ చిత్రాల షూటింగ్ లలో బిజీ బిజీగా గడుపుతున్న ఈ కన్నడ భామ దీపావళి పండుగ సందర్భంగా సరికొత్త విషయాన్ని తెలియజేసింది. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా గాని పెద్ద పండుగలకు కచ్చితంగా ఇంటికి వెళ్తాను. ఈ దీపావళి నాడు సొంత ఊరికి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా దీపావళి పండుగ రోజు మా కుటుంబంలో పండుగకి ఒక రోజు ముందుగానే బంగారం మరియు వెండి కొంటారు.
ఈ రీతిగా ఆభరణాలు కొనటం మా కుటుంబానికి పెద్ద సెంటిమెంట్. అలాగే కొత్త సినిమాలకు ముందు కూడా బంగారం మరియు వెండి ఆభరణాలు కొనటం మా ఫ్యామిలీకి ఒక సెంటిమెంట్ అంటూ సరికొత్త విషయాలు రష్మిక మందన తెలిపింది. మా ఇంటిలో నన్ను మరియు మా చెల్లెలు అని మా నాన్నగారు మహాలక్ష్మిలు అని పిలుస్తారు. అలా పిలిస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది అని స్పష్టం చేసింది.
కన్నడ ఇండస్ట్రీ నుండి “చలో” సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన..”గీతా గోవిందం”తో యూత్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకేవరు తో మంచి హిట్ అందుకోంది. డియర్ కామ్రేడ్, భీష్మ సినిమాలతో కూడా వరుస విజయాలు అందుకుంది. “పుష్ప” సినిమాతో నేషనల్ వైడ్ ఇమేజ్ సొంతం చేసుకోంది. ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అనేక అవకాశాలు అనుకుంటూ విజయవంతమైన హీరోయిన్ గా రష్మిక మందన దూసుకుపోతోంది.