మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కు సిద్ధమవుతోంది అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ చిత్రంలో పూజ హెగ్డే తో పాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతుందట.
ఆ హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండేను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని అంటున్నారు. అయితే ఈ ప్రచారం పట్ల మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు.
అనన్య పాండే ఇటీవల విడుదలైన `లైగర్` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంపై కొందరు అనన్యను సైతం తప్పు పట్టారు. ఆమె నటించడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే మహేష్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.
https://newsorbit.com/cinema/mahesh-babu-rajamouli-movie-latest-news-update.html