టాలీవుడ్లో ట్యాలెంటెడ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న శర్వానంద్.. తాజాగా `ఒకే ఒక జీవతం` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు.
ఇందులో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తే.. అమల అక్కినేని శర్వాకు తల్లి పాత్రను పోషించింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో.. మేకర్స్ `థ్యాంక్యూ మీట్`ను నిర్వహించారు.
ఈ ఈవెంట్లో `ఒకే ఒక జీవితం` సక్సెస్పై శర్వా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. `నాలుగైదేళ్లుగా నాకు హిట్ లేదు. హిట్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేది మీ అందరికీ తెలుసు. థియేటర్స్ లో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూశాక హమ్మయ్య అనుకున్నాను. నా చుట్టు పక్కనున్న వాళ్లంతా ఈ సారి నేను సక్సెస్ కొట్టాలని అనుకున్నారు.
అక్కడే నేను సక్సెస్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. శ్రీకార్తీక్ ఇలాంటి కథలు ఎప్పుడు రాసినా చేయడానికి రెడీగా ఉన్నాను` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, 2017లో వచ్చిన `శతమానంభవతి` తర్వాత హిట్ ముఖమే చూడని శర్వా.. ఎట్టకేలకు `ఒకే ఒక జీవితం`తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.