Mahesh Babu and S.S. Rajamouli Movie Updates: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గ ఆర్ట్స్ పాతకంపై సీనియర్ నిర్మాత కె ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. `సర్కారు వారి పాట` హిట్ అనంతరం మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో(Trivikram Srinivas) ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు.
ఇది ఆయనకు 28వ చిత్రం. `ఎస్ఎస్ఎమ్బీ 28`(SSMB 28) వర్కింగ్ టైటిల్తో ఫిబ్రవరిలోనే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ మూవీ ఫినిష్ అయిన వెంటనే మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ షురూ కానుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజ్ టాక్ నెట్టింట వైరల్గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అదేంటంటే.. ఈ చిత్రంలో మహేశ్ కోసం బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ను రంగంలోకి దింపుతున్నారట. ఆమె హీరోయిన్గా బాగా సెట్ అవుతుందని భావించిన రాజమౌళి.. ఆమెనే ఫైనెల్ చేసే పనిలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా, పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన `సాహో` చిత్రంతో శ్రద్ధాకపూర్ టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ మూవీ ఒక్క బాలీవుడ్లో మినహా మిగతా అన్ని భాషల్లోనూ నిరాశపరిచింది. సాహో అనంతరం శ్రద్ధా టాలీవుడ్లో మరో సినిమా చేయలేదు. బాలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందింది.