శ్రుతి హాసన్.. ఈ అమ్మడు టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం ఈ బ్యచూటీ తెలుగులో నందమూరి బాలకృష్ణకు జోడిగా `వీర సింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవితో `మెగా 154`, ప్రభాస్ సరసన `సలార్` చిత్రాల్లో నటిస్తోంది.
షూటింగ్ దశలో ఉన్న ఈ మూడు చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. శృతిహాసన్ హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. `ది ఐ` పేరుతో గ్రీక్, ఇంగ్లీష్ భాషల్లో ఓ సైకలాజికల్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో స్కాటిష్ యాక్టర్ మార్క్ రౌలే హీరోగా నటిస్తోండగా.. శ్రుతిహాసన్ హీరోయిన్గా కనిపించబోతోంది.
ఈ చిత్రంలో పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను పోగొట్టుకున్న మహిళగా శ్రుతి హాసన్ కనిపించబోతోంది. ఈ చిత్రానికి డ్రాఫ్నే ష్నోమన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రీస్లో ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. శ్రుతి హాసన్ సైతం షూటింగ్లో పాల్గొంటోంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించినశ్రుతి హాసన్.. `ది ఐ` ప్రాజెక్ట్ లో భాగమైనందుకు ఎంతో ఎక్సైట్ గా ఉందని వెల్లడించింది.
అయితే ఒకవేళ ఈ సినిమా ద్వారా హాలీవుడ్ లో శ్రుతిహాసన్ కు మంచి గుర్తింపు దక్కిందంటే.. అక్కడ ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే జరిగి శ్రుతిహాసన్ హాలీవుడ్ లో బిజీ అయిందంటే.. ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్స్కు శ్రుతిహాసన్ దొరకనట్టే అని అంటున్నారు.
https://twitter.com/shrutihaasan/status/1583137182369296384?s=20&t=KWlABbcZVMYSyD-Z_BjmIw
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!