వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్స్ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ ఇద్దరు సీనియర్ స్టార్స్ మరెవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి ఒకరైతే.. మరొకరు నందమూరి బాలకృష్ణ. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ చిత్రాన్ని చేస్తున్నాడు.
`వీర సింహారెడ్డి` అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నేర్మిస్తున్నారు. అలాగే చిరంజీవి విషయానికి వప్తే.. ఈయన ప్రముఖ దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నాడు. `మెగా 154` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సైతం మైత్రీ మూవీ వారే నిర్మిస్తున్నారు. `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
అయితే ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్నే హీరోయిన్గా నటించింది. పైగా ఇప్పుడు ఈ రెండు సినిమాలను సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే ప్రమోషన్స్ కూడా దాదాపు ఒకే సమయంలో ప్రారంభం అవుతాయి. దీంతో శృతిహాసన్ రెండు సినిమాల ప్రమోషన్స్ లోనూ పాల్గొనాల్సి ఉంటుంది.
అయితే శ్రుతి ఏ సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ రెండు చిత్రాల్లో ఏ ఒక దానిని తక్కువ చేసినా ఆయా హీరోల అభిమానులు అస్సలు ఊరుకోరు. పనిగట్టుకుని మరీ విమర్శలతో ఎటాక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చిరు-బాలయ్యలు శ్రుతిహాసన్ కు పెద్ద తలనొప్పే తెచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://newsorbit.com/entertainment-news/shruti-haasan-opens-her-health-issues.html