దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను.. హీరోయిన్లు తూచ తప్పకుండా ఫాలో అవుతుంటారు. సినిమా అనే రంగుల ప్రపంచంలో కెరీర్ ఒకేలా సాగడం అసాధ్యం. ముఖ్యంగా హీరోయిన్లు ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతామో కూడా ఊహించలేరు. అందుకే మంచి ఫామ్లో ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
ఇక ఇప్పుడు శ్రుతి హాసన్ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుంటుందట. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసిందట. `క్రాక్`తో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్.. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే తన పారితోషికాన్ని డబుల్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
ఇంతకు ముందుకు ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకునే శ్రుతి హాసన్.. ఇప్పుడు రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తుందట. వరసగా హిట్లను ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న శ్రుతి హాసన్.. పాత్రకు అవసరమైతే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా నటిస్తుంది.
అందుకే మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదట. కాగా, శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు జోడీగా `సలార్`, నందమూరి బాలకృష్ణ సరసన `ఎన్బీకే 107` చిత్రాల్లో నటిస్తోంది. అలాగే వీటితో పాటు చిరంజీవితో `మెగా 154` మూవీ కూడా చేస్తోంది.