శ్రుతి హాసన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో ఈమె ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో నటిస్తోంది. వారిలో నటిసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మెగాస్టార్ చిరంజీవి మరొకరు. బాలయ్యతో ఈమె `ఎన్బీకే 107` మూవీ చేస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.
ఇప్పటికే అరవై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన భాగాన్ని కూడా మేకర్స్ త్వరత్వరగా పూర్తి చేస్తున్న తరుణంలో బాలయ్య కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు మరికొందరికి కూడా కరోనా సోకగా.. ఈ మూవీ షూటింగ్కి బ్రేక్ పడింది. అయితే ఈ గ్యాప్లో శ్రుతి హాసన్ మెగాస్టార్ కోసం దిగిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాసన్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం `మెగా 154`. యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఊరమాస్ చిత్రమిది. `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ ఈ మూవీకి దాదాపు కన్ఫార్మ్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఇకపోతే ఈ మూవీ షూటింగ్ గత కొద్ది రోజుల నుండీ శరవేగంగా జరుగుతుండగా.. నేటి నుండి శ్రుతి హాసన్ సైతం షూట్లో జాయిన్ అయిందట. ప్రస్తుతం చిరు, శ్రుతి హాసన్ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ చిరంజీవికి తమ్ముడిగా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.