ఆగస్టు నెలలో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `సీతారామం` ఒకటి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు డైరెక్టర్గా చేసిన రెండో చిత్రమిది. ఇందులో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భుమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. యుద్ధ నేపథ్యంలోనే సాగే అద్భుతమైన ప్రేమ కావ్యమిది. ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్లో చేరిన ఈ చిత్రం.. బాక్సాఫీన్ వద్ద ఇంకా సత్తా చాటుతోంది. రూ. 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. రూ. 20 కోట్లకు పైగా లాభాలను దక్కించుకుంది.
ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. `సీతారామం` ఓటీటీ రిలీజ్ కు డేట్ లాక్ అయింది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సాలిడ్ ధరకు సొంతం చేసుకుంది. అయితే సీతారామంను సెప్టెంబర్ 9 నుండి స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వారు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే.