మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `సీతా రామం`. ‘యద్ధంతో రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్ట్గా రానున్నారని ముందు నుండే వార్తలు వచ్చాయి.
ప్రభాస్ తో బాలయ్య పోటీ.. అదే జరిగితే బాక్సులు బద్దలవ్వడం ఖాయం!
ఈ వార్తలను నిజం చేస్తూ.. మేకర్స్ కూడా ప్రభాస్ గెస్ట్గా వస్తున్నారని ప్రకటించారు. దాంతో ఆయనను చూడాలని అభిమానులు తెగ ఉత్సాహపడ్డారు. కానీ, సీతారామం మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ను ఉసూరుమనిపించారు. నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ప్రభాస్ వచ్చి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. కానీ, ఈ ఈవెంట్కు అభిమానులను అనుమతించకుండా నిరాశ పరిచారు మేకర్స్.
హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో చిన్న ప్రాంగణంలో మీడియా, కొందరు సినీ ప్రముఖుల మధ్య ఈ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాధారణ అభిమానులను అనుమతించడం లేదు. ఎంపిక చేసిన కొందరు ఫ్యాన్స్ మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. రీసెంట్ గా `బింబిసార`సినిమా ప్రీరిలీజ్ పంక్షన్ లో ఓ అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన కారణంగానే `సీతారామం` నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
#PrabhasForSitaRamam 🤩❤️ pic.twitter.com/TAEoZBpNzg
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 3, 2022