సమంత టైటిల్ రోల్ లో తెరకెక్కిన తాజా చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు కీలక పాత్రలను పోషించారు.
సరోగసీ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో సమంత ప్రెగ్నెంట్ లేడీగా కనిపించబోతోంది. నవంబరు 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమాకు కొంత హైప్ ఏర్పడింది. ప్రమోషన్స్ ద్వారా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని భావించారు.
కానీ, ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో జరగలేదు. మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రమోషన్స్లో పాల్గొనే పరిస్థితి లేదు. అయినాసరే యశోదకు భారీ బజ్ నెలకొంది. అందుకు కారణం సమంతనే. మయోసైటిస్ వల్ల చేతికి సెలైన్ పెట్టుకునే యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పింది సమంత. దీంతో సమంత సినిమా ప్రమోషన్ కు వచ్చే పరిస్థితి లేదు అంటూ భావించారు.
ఈ క్రమంలో సమంతతో పాటు యశోద సినిమా గురించి కూడా చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఈ విధంగా యశోద సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ అయితే దక్కింది. యశోద సినిమా కు సమంత పబ్లిసిటీ చేయకున్నా కూడా తప్పకుండా సానుభూతి కలిసి వస్తుందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.