`సర్కారు వారి పాట` వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్బీ28` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. ఇప్పటికే తొలి షెడ్యూల్ను కంప్లీట్ చేసుకుంది. దసరా పండుగ అనంతరం రెండో షెడ్యూల్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇంకా షూటింగ్ పూర్తి కాకముందే ఈ సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ జరుగుతోందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
థియేట్రికల్ రైట్స్ రూ. 125 కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 75 కోట్లు, ఆడియో రైట్స్ రూ. 30 కోట్లు.. మొత్తంగా రూ. 200 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ రూమర్లే అని నిర్మాత నాగ వంశీ తేల్చేవారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన..మహేశ్-త్రివిక్రమ్ మూవీపై స్పందించారు.
`ఎస్ఎస్ఎమ్బీ 28` సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదని, అలాంటప్పుడు వందల కోట్ల బిజినెస్ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అసలింకా తాము బిజినెసే స్టార్ట్ చేయలేదని, అంతే కాకుండా ఈ మూవీకి బడ్జెట్ ఎంత అన్నది ఇంకా తమకే ఓ క్లారిటీ రాలేదని ఆయన వెల్లడించారు. మొత్తానికి ఈయన వ్యాఖ్యలతో మహేశ్ మూవీపై ఓ క్లారిటీ అయితే వచ్చింది.
https://newsorbit.com/entertainment-news/trivikram-srinivas-mahesh-babu-movie-shooting-stopped.html