మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. దాదాపు పదిహేడేళ్ల నుంచి గ్లామర్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. దక్షిణాది సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువనిస్తుందో ఆమె తాజాగా చేసిన ఈ చిన్న పని నిదర్శనంగా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమన్నా రీసెంట్గా ఆస్ట్రేలియాలోని జరిగిన ఐఎఫ్ఎఫ్ఎమ్ (ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్) అవార్డు కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా హాజరు అయింది. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరోయిన్లు తమన్నా, తాప్సీ పన్ను సైతం జ్యోతి ప్రజ్వలన చేశారు.
అయితే తమన్నా కాలికి ఉన్న చెప్పులను విడిచిపెట్టి.. కొవ్వొత్తితో దీపం వెలిగించింది. కానీ, తాప్సీతో సహా మిగిలిన వారందరూ చెప్పులు ధరించే జ్యోతి ప్రజ్వలన చేశారు. దీంతో ఇందుకు సంబంధించి వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. తమన్నా చేసిన పనికి అందరూ ఫిదా అయిపోతున్నారు.
చిన్న పనులే గొప్పగా ప్రభావితం చేస్తాయని, సంస్కృతిని గౌరవించడమంటే ఇదే అని, భారత్ దేశ గొప్ప సంస్కృతీ వారసత్వాన్ని తమన్నా తెలియజేసిందని నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `భోళా శంకర్`, సత్యదేవ్ సరసన `గుర్తుందా శీతాకాలం` చిత్రాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ ఈ మూడు ప్రాజెక్ట్స్కు సైన్ చేసింది.
https://www.instagram.com/tv/ChRPsIEj6BI/?utm_source=ig_web_copy_link