Veera Simha Reddy: నరసింహం నందమూరి బాలయ్య మూవీ “వీరసింహారెడ్డి” సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12వ తారీకు విడుదల కానుంది. అయితే ఈ వారంలోనే ఒంగోలులో “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం సెన్సార్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ కావడం జరిగింది. అయితే లేటెస్ట్ గా “వీరసింహారెడ్డి” థియేట్రికల్ ట్రైలర్ చూసినట్లు ఎస్ఎస్ తమన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
జనవరి ఆరో తారీకు నాడు యూట్యూబ్ రచ్చ రచ్చ అవుతుందని… చెప్పుకోచ్చారు. దీంతో అభిమానులు ట్రైలర్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే “వీరసింహారెడ్డి” పాటలు, ఫోటోలు మరియు వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పైగా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో ఒక పరాజయం కూడా లేకపోవడంతో… “వీరసింహారెడ్డి” పై భారీ అంచనాలు ఫ్యాన్స్ పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి నాలుగో సాంగ్ రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావించింది. కానీ ఒక్కసారిగా ప్లాన్ మార్చే ముందుగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల అవటానికి ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో… “వీరసింహారెడ్డి” సినిమా యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడం జరిగింది.
ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రిక రవి, హనీ రోజ్ స్పెషల్ సాంగ్ లో బాలయ్యతో చిందులేస్తున్నారు. బాలయ్య కెరియర్ లో అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ “సమరసింహారెడ్డి” సినిమాకి 200 రెట్లు ఈ సినిమా ఉంటుందని డైరెక్టర్ చెప్పడంతో… “వీరసింహారెడ్డి” టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.