`ఛలో`, `భీష్మ` వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల.. మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది.
కానీ.. గత కొద్ది రోజుల నుంచి చిరంజీవి-వెంకీ కుడుముల ప్రాజెక్టు ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. వెంకీ చెప్పిన లైన్ చిరంజీవికి బాగా నచ్చినా.. కథ కథనం పూర్తిస్థాయిలో మెప్పించకపోవడంతో ఆయన ఈ ప్రాజెక్టును వదులుకున్నారని జోరుగా టాక్ నడుస్తోంది.
అయితే ఇలాంటి తరుణంలో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే చిరు హ్యాండ్ ఇవ్వడంతో వెంకీ నటసింహం నందమూరి బాలకృష్ణను తగులుకున్నారట. ఆయనతో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.
బాలయ్యతో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసేందుకు వెంకీ కుడుముల ప్లాన్ చేస్తున్నాడని తాజాగా వార్తలు వస్తున్నాయి. మరి చిరంజీవి వదులుకున్న కథతోనే వెంకీ బాలయ్యతో సినిమా చేస్తాడా..? లేక కొత్త కథను రెడీ చేస్తున్నాడా..? అన్న దానిపై స్పష్టత లేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!