`జాతిరత్నాలు` వంటి సూపర్ హిట్ చిత్రంలో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. ఓ డైరెక్టర్ చేతిలో తన్నులు తిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫరియా త్వరలోనే `లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్, అమృతా క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫరియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే `జాతి రత్నాలు షూటింగ్ టైం లో డైరెక్టర్ అనుదీప్ కేవీ నిన్ను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది నిజమేనా?` అంటూ ప్రశ్నించగా.. ఫరియా అవునని తెలిపింది.
అయితే `అది సరదాగా జరిగింది. సెట్లో అనుదీప్ గారు చాలా సరదాగా ఉంటారు. ఆయన జోక్స్ వేసేటప్పుడు నవ్వుతూ పక్కన ఉన్న వాళ్ళని కొడుతుంటారు. అది ఆయనకున్న అలవాటు. అలా ఒకసారి నన్ను కూడా సరిదాగా చేతితో కొట్టారు అంతే` అంటూ వివరణ ఇచ్చింది. దీంతో చిట్టి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
https://newsorbit.com/cinema/faria-abdullah-get-chance-in-vijay-antony-movie.html
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!