SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు “SSMB 28” ప్రాజెక్ట్ కి అనేక బ్రేకులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయగా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నెలలో స్టార్ట్ అయింది. ఈ క్రమంలో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇక రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అన్న తరుణంలో… హీరోయిన్ పూజ హెగ్డే కాలికి గాయం కావడం ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో.. షూటింగ్ వాయిదా పడింది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే తల్లి ఇందిరా దేవి మరణించడం తరువాత కృష్ణ మరణించడంతో మహేష్ ఎంతగానో కృంగిపోయాడు.
దీంతో “SSMB28” షూటింగ్ ఏంటి అన్న సందిగ్ధంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో హారిక హాసిని నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా గుడ్ న్యూస్ తెలియజేసింది. విషయంలోకి వెళ్తే జనవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అని పేర్కొంది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుంది. అదే సమయంలో అప్ డేట్స్ కూడా ఇవ్వటం జరుగుద్ది అని స్పష్టం చేసింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఏప్రిల్ 28వ తారీకు సినిమా విడుదల కానున్నట్లు.. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మరి తాజా ప్రకటనతో నాలుగు నెలలలో షూటింగ్ కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం “SSMB 28” టీం దుబాయ్ లో సందడి చేస్తూ ఉంది. అక్కడి క్రిస్మస్ ట్రీ దగ్గర ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఫోటోలో నిర్మాతలు మరియు దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు మహేష్ బాబు మరియు తమన్ ఉన్నారు.