Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవలె డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `లైగర్` చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. వీరి కాంబోలో రూపుదిద్దుకున్న తొలి చిత్రమిది. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించగా.. రమ్యకృష్ణ, వరల్డ్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. బ్యాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇంతలోనే విజయ్ దేవరకొండతో పూరీ జగన్నాథ్ తన డ్రామ్ ప్రాజెక్ట్ అయిన `జనగణమన`ను ప్రకటించాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదీ పాన్ ఇండియా చిత్రమే కాగా.. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సైతం షురూ అయింది. అయితే తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయబోతున్నాడట. వీరిద్దరూ తమ హ్యాట్రిక్ ప్రాజెక్ట్ను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట. ఈ సినిమా కథను పూరీ ఆల్రెడీ రెడీ చేశాడని.. అది విజయ్కు బాగా నచ్చిందని కూడా ప్రచారం జరుగుతుంది.
దీంతో విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, `లైగర్` మూవీ ఇంకా రిలీజ్ కాలేదు, దాని రిజల్ట్ ఏంటో తెలిదయు. అయినప్పటికీ పూరీ మీద ఉన్న నమ్మకంతో `జనగణమన`కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు ఏకంగా మూడో సినిమాకు సైతం ఓకే చెప్పాడని వార్తలు రావడంతో.. అసలు విజయ్ దేవరకొండకి ఏమైంది, కెరీర్ విషయంలో ఎందుకింత గుడ్డి వెళ్తున్నాడు అంటూ అభిమానులు కలవర పడుతున్నారు.