టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటుతున్న హీరోయిన్స్లో సమంత ఒకరు. ఈమె ఇటీవలె భర్త నాగచైతన్యతో విడిపోయింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. దాంతో విడాకుల వైపు టర్న్ తీసుకున్నారు. చైతుతో సపరేట్ అయిన అనంతరం సామ్ కెరీర్పైనే ఫోకస్ పెట్టింది.
అలాగే మరోవైపు సోషల్ మీడియా సూపర్ యాక్టివ్గా ఉంటూ.. ఇంట్రస్టింగ్ పోస్ట్లు, హాట్ హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలిచింది. అయితే ఏమైందో ఏమో గానీ.. గత కొద్ది రోజుల నుంచీ సమంత సోషల్ మీడియాలో కనిపించడం లేదు. సమంత చివరిగా జూన్ 30న ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాకు దూరమై పోయింది. ట్విటర్లో కూడా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
దీంతో పెళ్లి నాటి జ్ఞాపకాలను సామ్ మరచిపోలేకపోతుందని, అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది నిజం కాదట. సోషల్ మీడియాలో సమంత సైలెంట్గా ఉండటానికి అసలు కారణం వేరే ఉందట. సమంత బాలీవుడ్ లో రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కబోతున్న `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ లో నటించనుంది.
ఈ సిరీస్ కోసం సమంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుందట. పూర్తిగా వాటిపైనే ఫోకస్ పెట్టి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందాలని భావిస్తుందట. అందుకే సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని, ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో ఆమె బిజీగా ఉందని అంటున్నారు. కాగా, సమంత ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఆమె `యశోద`, `శాకుంతలం` చిత్రాలను ఫినిష్ చేసింది. విజయ్ దేవరకొండతో కలిసి `ఖుషి` అనే సినిమా చేస్తోంది. ఇక ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ తో హాలీవుడ్కు కూడా సామ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.