టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. ఇందులో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న మూవీ ఇది.
ఇందులో విజయ్ కెరీర్లోనే తొలిసారి బాక్సర్గా అలరించబోతున్నాడు. అలాగే రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, ప్రపంచ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్గా ఈ మూవీ విడుదలు కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ వరుస అప్డేట్స్తో సినిమాపై అన్ని భాషల్లోనూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. `లైగర్`కు విజయ్ దేవరకొండ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆయనకంటే ముందే ముగ్గురు స్టార్ హీరోలకు పూరీ కథ వినిపించాడట. ఇంతకీ ఆ ముగ్గురు హీరోలు ఎవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్.
అయితే ఎన్టీఆర్ తనుకు `లైగర్` కథ సెట్ అవ్వదని రిజెక్ట్ చేశాడట. ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్తో బిజీ ఉండటం వల్ల `లైగర్`పై ఇంట్రస్ట్ చూపలేకపోయాడట. ఇక బన్నీ సైతం ఏవో కారణాల వల్ల `లైగర్` ను వదులుకున్నాడట. దాంతో పూరీ ఆఖరికి విజయ్ను లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!