
Guppedantha Manasu August 26 Episode 539: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 539వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగష్టు 26 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరగనుందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో వసు తన ప్రేమ విషయం రిషికి చెప్పాలి అని నాకు మీరు కావాలి మీ ప్రేమ కావాలి.. మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చెయ్యాలి.
Guppedantha Manasu: రిషికి లవ్ ప్రపోజ్ చేసిన వసు

రిషి లేకుండా ఈ వసు పూర్తి కాదు.. మీరు లేకుండా.. ఈ వసుధార లేదు అంటుంది వసు.నన్ను క్షమించండి.. నా ప్రేమని అంగీకరించండి.. ఐ లవ్యూ’ అంటూ రిషికి వసు తన చేతిలోని గిఫ్ట్ని అందిస్తూ రిషికి లవ్ ప్రపోజ్ చేస్తుంది వసు.
Guppedantha Manasu Episode 538: వసు, రిషిలు ప్రేమ రిషిదారగా మారనుందా..??
ఇక ఈరోజు గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను..ఈ మాట ఇప్పుడు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో భయం వేస్తుంది సార్ అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ రిషికీ ఇస్తుంది. రిషి ఆ గిఫ్ట్ ను చూస్తూ రిషి సంతోషంతో ఇప్పటినుంచి ఈ బొమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది వసుధార అని అంటాడు. దాంతో వసుధార ఎంతో సంతోష పడుతూ ఉంటుంది.
గుప్పెడంత మనసు: కొడుకు జీవితం గురించి ఆలోచనలో పడ్డ జగతి

మరొకవైపు మహేంద్ర జగతి ఇద్దరూ రిషి, వసు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. వసు ఈరోజు తన మనసులోని మాట రిషి కి చెప్పకపోతే జీవితాంతం ఇంకా చెప్పలేదు అంటుంది జగతి.ఒకవేళ వసు తన మనసులో మాట చెప్పకపోతే పరీక్షల తర్వాత వీళ్లు ఇంకా కలవడానికి అవకాశం ఉండదు అని అంటుంది జగతి. అలా వారిద్దరూ కాసేపు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
వర్షం సాక్షిగా ఒక్కటి అయిన రిషిదార :
మరొకవైపు రిషి,వసుధార ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.అప్పుడు రిషి ఎప్పటికీ మనిద్దరం ఇలాగే కలిసి ఉండాలి. జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి ఉండాలి అని అనటంతో వసు సరే అని అంటుంది. అప్పుడు రిషి ఆరోజు నువ్వు నన్ను కాదన్నావు నిన్ను ఎవరు బెదిరించారు అని వసును అడగగా సాక్షి అని చెప్పడంతో రిషి షాక్ అవుతాడు. ఉంటుంది.
Guppedantha Manasu Episode 537: ఫేర్ వెల్ పార్టీ తరువాత వసు, రిషి విడిపోనున్నారా…?
ఆ తర్వాత రిషి మన ప్రేమ కొనసాగాలి వసు అలాగే నువ్వు నీ ప్రేమను కూడా త్యాగం చేయాలి అనడంతో పసుధార షాక్ అవుతుంది. మన ప్రేమ నీ చదువుకు అడ్డం కాకూడదు అని నేను అనుకుంటున్నాను అంటూ పసుధార దగ్గర ప్రామిస్ తీసుకుంటాడు రిషి.ఆ తర్వాత ఒక్కసారిగా ఉరుములు రావడంతో వసు వెళ్లి ఒక్కసారిగా గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత రిషి, వసు నీ దగ్గరికి తీసుకొని ఈ పంచభూతాల సాక్షిగా ఈ నిమిషం నుంచి మనిద్దరం ప్రేమ అనే ప్రయాణం మొదలు పెడదాము అని అంటాడు.