కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం అధికారికంగా అనౌన్స్ చేసింది. 2020లో వచ్చిన సినిమాలకు గాను ఈ అవార్డులను ప్రకటించింది. అయితే ఈ సారి టాలీవుడ్ కు నాలుగు అవార్డులు దక్కడం విశేషం. అందులో `నాట్యం` సినిమాకే రెండు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి.సంప్రదాయ నాట్యం నేపథ్యంలో రూపుదిద్దుకున్న డ్యాన్స్ డ్రామా చిత్రమిది. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యా రాజు వన్ ఉమెన్ షో అని చెప్పవచ్చు. యాక్టింగ్ పరంగా, డ్యాన్సుల పరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఉత్తమ కొరియోగ్రాఫర్ (సంధ్యారాజు)తో పాటు జాతీయ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ (టీవీ రాంబాబు) విభాగాల్లో నాట్యం సినిమా అవార్డులను దక్కించుకుంది.
ఐదు జాతీయ అవార్డులు అందుకున్న డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ..??
అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా `అల వైకుంఠపురములో` చిత్రానికి గానూ మ్యూజిక్ సెన్షేషన్ తమన్ కు అవార్డు వరించింది. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన `కలర్ ఫొటో` ఎంపికైంది. ఇందులో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించారు.
1990లలో మచిలిపట్నం నేపథ్యంలో ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మాతమైన ఈ చిన్న సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. ఇప్పుడు జాతీయ అవార్డును సైతం దక్కించుకోవడం విశేషంగా మారింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!