నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో తన 107వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. దునియా విజయ్ విలన్గా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఈ సినిమా కథ తండ్రి-కూతురు మధ్య అల్లుకుని ఉంటుందని, ఇందులో బాలయ్య కూతురిగా యాంకర్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్లడించారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహూ గారపాటి ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు కాస్టింగ్ పనుల్లో అనిల్ రావిపూడి బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటించమని మేకర్స్ త్రిషను సంప్రదించారట.
కథ నచ్చడంతో.. ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య 108 లో నటించేందుకు త్రిష ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. అయితే నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే త్రిష బాలయ్య 108 లో హీరోయిన్గా ఫిక్స్ అయిందా..? లేదా..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.