మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుండి సినిమా వచ్చి రెండున్నర ఏళ్లు అవుతోంది. ఎప్పుడో 2020 ఆరంభంలో `అల వైకుంఠపురంలో` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత ఈయన నుంచి మరో మూవీ రాకపోయినా.. త్రివిక్రమ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో ఓ మూవీ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఆగస్టు నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.
అయితే ఈలోపే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఓ యాడ్ చేశాడు. ఇప్పటికే జొమాటో, రెడ్ బస్, ఫ్రూటీ వంటి బ్రాండ్స్కు బన్నీ ప్రచార కర్తగా ఉన్నాడు. తాజాగా ఆయన చేత మరో ప్రముఖ సంస్థ తమ ప్రొడెక్ట్ను ప్రమోట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. సదరు బ్రాండ్ ఎండార్స్మెంట్ షూట్ లో బన్నీ నిన్న పాల్గొన్నాడు. ఈ యాడ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ త్రివిక్రమ్ దక్కించుకున్నారు.
హైదరాబాద్ ఈ యాడ్ షూట్ జరిగింది. అయితే నిన్న జరిగిన ఈ ఒక్కరోజు యాడ్ షూటింగ్కు త్రివిక్రమ్ భారీ రెమ్యునరేషన్ ఛార్ట్ చేశాడట. సోషల్ మీడియా కథనాల ప్రకారం.. ఆయన రూ. 45 లక్షలు పారితోషికం అందుకున్నాడని అంటున్నారు. ఏదేమైనాగంటల వ్యవధిలో అంత సంపాదన అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.