తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ త్వరలో స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఐదు సీజన్లు ముగిసాయి. ఆరో సీజన్ సెప్టెంబర్ నెల నుండి ప్రారంభం ప్రారంభం. ఈ సీజన్ కి సంబంధించిన లోగో మరియు ప్రోమో కూడా విడుదల కావడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి చాలా వరకు కంటెస్టెంట్ల విషయంలో మొదటి నుండి ఓ ఫార్మేట్ పరంగా షో నిర్వాహకులు సెలెక్ట్ చేస్తూ వస్తున్నారు.
సింగర్స్, టీవీ యాంకర్స్, యూట్యూబ్ స్టార్స్.. ఇంకా సీనియర్ యాక్టర్.. ఇదే రీతిలో సెలబ్రిటీ కపుల్స్. గతంలో బిగ్ బాస్ హౌస్ లో హీరో వరుణ్ సందేశ్.. అతని భార్య వీతిక సీజన్ త్రీ లో ఆడడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ సిక్స్ లో కూడా మరో సెలబ్రిటీ కపుల్స్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ 4 నుండి బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ కానునట్లు టాక్. ఈ క్రమంలో సెలబ్రిటీ కపుల్స్ కోటాలో భాగంగా సింగర్స్ హేమచంద్ర.. శ్రావణి భార్గవి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇటీవల వీళ్లిద్దరు విడిపోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇటువంటి తరుణంలో వచ్చిన వార్తలకు పుల్ స్టాప్ పెట్టే తరహాలో హేమచంద్ర.. శ్రావణి భార్గవి ఆరో సీజన్ లో పోటీ పడనున్నట్లు సమాచారం. ఇద్దరు సింగర్స్ కావడంతో హౌస్ లో బడ్జెట్ ఉండే అవకాశం ఉందని షో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకొని.. ఇద్దరికీ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.