Samantha KTR: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రజలలో ఉండే రీతిలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయటం మరో పక్క కాంగ్రెస్ కూడా.. వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయట పెడుతూ రాణించటం జరుగుతోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు దీటుగానే కౌంటర్ లు ఇస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ముఖ్యంగా జరగబోయే ఎన్నికలలో పోటీ బీజేపీ నుండి అని అన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ వర్గాల వ్యవహార శైలి కనిపిస్తోంది. మిగతా పార్టీలను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని టార్గెట్ చేస్తూ గత కొంత కాలం నుండి విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న తీరును గత కొద్ది నెలల నుండి ఎండగడుతున్న సంగతి తెలిసిందే. మీడియా పరంగా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ తనదైన శైలిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని మోడీ ప్రభుత్వ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో కేటీఆర్ చేసిన నెగిటివ్ కామెంట్ కి హీరోయిన్ సమంత రియాక్షన్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి విషయంలోకి వెళ్తే దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ ప్రజలు… దేశ జీడీపీలో ఐదు శాతం వాటా సమకూరుస్తున్నారు. మన దేశానికి కావాల్సింది డబ్బులు ఇంజిన్ కాదు.. డబుల్ ఇంపాక్ట్ గవర్నమెంట్.. అని కేటీఆర్ ఇన్ స్టాల్ ఓ పోస్ట్ పెట్టడం జరిగింది. కేటీఆర్ పెట్టిన ఈ పోస్టుకి సమంత లైక్ కొట్టడం జరిగింది. సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే సమంత.. పొలిటికల్ పోస్ట్ కి లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారింది.