మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన`తో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడీయన. డబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత `కొండపొలం` పలకరించాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూడో ప్రయత్నంలో తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్ధేశంతో `రంగ రంగ వైభవంగా`తో వచ్చాడు వైష్ణవ్.
బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గిరీశాయ దర్శకత్వం వహించాడు. కేతిక శర్మ ఇందులో హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 2న విడుదలై ఈ చిత్రం.. ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది.
ఈ మూవీతో వైష్ణవ్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. ఇదిలా ఉంటే.. ఈయన బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ కు `మీ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటే.. అందులో ఎవరు పెర్ఫామ్ చేయాలనుకుంటారు` అనే ప్రశ్న ఎదురైంది.
అందుకు వైష్ణవ్ తేజ్ వెంటనే యాంకర్ రష్మీ అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, యాంకర్ రష్మీ హాట్ హాట్ గా హావభావాలు పలికించే విధానం చాలా బావుంటుందని, అందుకే ఆమెను తన సినిమాలోని ఐటెం సాంగ్లో చూడాలనుందంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఆయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!