మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డబ్యూ మూవీ `ఉప్పెన`తోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత `కొండపొలం` పలకరించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ నుండి రాబోతున్న మూడో చిత్రం `రంగ రంగ వైభవంగా`.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. `అర్జున్ రెడ్డి` సినిమాను తమిళంలో రీమేక్ చేసి సక్సెస్ అయిన డైరెక్టర్ గిరీశాయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రోజైన సెప్టెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్కి.. `మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఏ చిత్రాన్ని రీమేక్ చేయాలనుంది..?` అనే ప్రశ్న ఎదురైంది.
అందుకు వైష్ణవ్ రిప్లై ఇస్తూ.. “వాళ్లు చేసినవన్నీ గొప్ప చిత్రాలు, క్లాసిక్స్, వాటిని టచ్ చేయలేము. వాళ్లు మాత్రమే న్యాయం చేస్తారు. తను ఆ సాహసం చేయలేను. అయితే కచ్చితంగా రీమేక్ చేయాల్సి వస్తే తాను పవన్ మామయ్య నటించిన `బద్రి` సినిమాని రీమేక్ చేస్తా. అది అంటే తనకు చాలా ఇష్టం` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో వైష్ణవ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!