ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తాను `మైయోసిటిస్` అనే వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధి. దీని బారిన పడ్డా సామ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. అయితే ఈ వ్యాధితో సమంత ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతోందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా ఈ ప్రచారం పై విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `యశోద`లో వరలక్ష్మీ ఓ కీల రోల్ను ప్లే చేసింది. ఈ చిత్రం నవంబర్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే సమంత ప్రమోషన్స్లో పాల్గొనే పరిస్థితి కనిపించకపోవడంతో.. వరలక్ష్మీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత అనారోగ్య సమస్య గురించి వరలక్ష్మీ మాట్లాడింది. `యశోద సినిమాలో సమంతతో కలిసి నటించడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సెట్స్ లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ సమయంలో సమంత మైయోసిటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతుందనే విషయం మాకు తెలియదు.
ఎందుకంటే, ఆమె ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండేది. యశోద సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆమె ఆరోగ్యం క్షీణించిందని అనుకుంటున్నా. కానీ, ఆమె ఒక ఫైటర్. అతి త్వరలోనే ఆమె కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుందనే నమ్మకం నాకు బలంగా ఉంది` అంటూ వరలక్ష్మీ తెలిపారు. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.