మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `మెగా 154` ఒకటి. యంగ్ డైరెక్టర్ బాబీ(కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీకి `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ దాదాపు కన్ఫామ్ అయింది. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం నలబై శాతం షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని కూడా త్వరత్వరగా కంప్లీట్ చేసి.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ మూవీని దింపేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఓ లేడీ విలన్ పాత్ర ఉంటుందట. చిరంజీవి చేస్తున్న వీరయ్య పాత్రకు, ఆ లేడీ విలన్కు మధ్య వైరం ఎంతో ఇంట్రస్టింగ్గా, పవర్ ఫుల్ గా సాగుతుందట.
ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ బాబీ ఆ లేడీ విలన్ పాత్ర కోసం విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్కు రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. త్వరలోనే ఆమె సెట్స్లోకి అడుగు పెట్టనుందంటూ టాక్ నడుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. మెగా ఫ్యాన్స్లో మాత్రం ఈ న్యూస్ అంచనాలను మరింత పెంచేసింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!