కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే `వారిసు(తెలుగులో వారసుడు)`. విజయ్ కెరీర్లో 66వ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, ఖుష్బూ, ప్రభు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కళ్లు చెదిరే స్థాయిలో జరుగుతోందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీరిలీజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయని జోరుగా టాక్ నడుస్తోంది. వరల్డ్ వైడ్గా వారసుడు నాన్ థియేట్రికల్ మరియు థియేట్రికల్ రైట్స్ రూ. 280 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ఇక తెలుగులో కూడా డీల్స్ క్లోజ్ అయితే మొత్తంగా ఈ మూవీ బిజినెస్ ఫైనల్ ఫిగర్ రూ. 300 కోట్లకు చేరువయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరి ఇదే నిజమైతే విజయ్ కెరీర్లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా `వారసుడు` రికార్డు సృష్టిస్తారు.