సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి దాదాపు పదేళ్ల తర్వాత `రామారావు ఆన్ డ్యూటీ`తో రీఎంట్రీ ఇచ్చారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 29న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. అయితే ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా నటించిన వేణుకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఇకపోతే రీఎంట్రీలో వేణు యమా జోరు చూపిస్తున్నారు. తాజాగా ఈయన ఓ అదిరిపోయే ఆఫర్ వరించిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం తాజాగా త్రివిక్రమ్ వేణు తొట్టెంపూడిని సంప్రదించాటర. ఆయనకు పాత్ర నచ్చడంతో.. వెంటనే ఓకే చెప్పారని, త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మరి నిజంగా మహేశ్ మూవీలో వేణు తొట్టెంపూడి ఛాన్స్ వచ్చిందా..? లేదా..? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, వేణు-త్రివిక్రమ్లు `స్వయంవరం` చిత్రంతో ఒకేసారి వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈ సనిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. ఆ తర్వాత వేణు నటించిన ‘చిరునవ్వుతో’ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు రాశారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!