సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కామెడీ, కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు.. గత పదేళ్ల నుండీ నటనకు దూరంగా ఉంటున్నారు. 2012లో వచ్చిన `రామాచారి` తర్వాత వేణు నుండి మరో మూవీ రాలేదు.
అయితే ఇప్పుడు ఈయన `రామారావు ఆన్ డ్యూటీ` మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంటర్టైనర్ ఇది. నేడు గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా ఓ కీలక పాత్రను పోషించారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వేణు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఫ్యామిలీ బిజినెస్స్ లు కారణంగా ఇన్నాళ్లు నటనపై ఇంట్రస్ట్ చూపలేకపోయానని.. ఇకపై మాత్రం సినిమాలు ఆపనని ఆయన స్పష్టం చేశారు. వెబ్ కంటెంట్ పై కూడా ఫోకస్ చేస్తానని వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `దమ్ము` మూవీపై వేణు షాకింగ్ కామెంట్స్ చేశారు.
`షోలే సినిమాలో బిగ్ బి అమితాబ్ లాంటి క్యారెక్టర్ అన్నారు. తీరా చూస్తే ఏం జరిగిందో మీకే తెలుసు. షోలేలో అమితాబ్ చనిపోయినట్లు దమ్ము సినిమాలో నా క్యారెక్టర్ కూడా చనిపోతుంది. ఈ రెండు సినిమాల మధ్య పోలిక అదొక్కటే. అయినాసరే ఆ మూవీ చేసినందుకు ఎప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు` అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈయన వ్యాఖ్యల బట్టీ చూస్తుంటే.. దమ్ము సినిమాలో తన పాత్ర విషయంలో వేణు మోసపోయారని స్పష్టంగా తెలుస్తోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!