టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్, మేకింగ్ వీడియోలు సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేయగా.. మేకర్స్ ప్రమోషన్స్తో ఆ హైప్ను పీక్స్కు తీసుకెళ్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండను ఎక్కడ చూసినా రూ. 200 ఖరీదు చేసే చప్పులు ధరించే కనిపిస్తున్నాడు. ఈ విషయంలో కొందరు సింప్లిసిటీ అంటూ విజయ్ను ప్రశంసిస్తుంటే.. మరకొందరు జనాల దృష్టిని ఆకట్టుకునేందుకే అలా చేస్తున్నాడని విమర్శలు కురిపిస్తున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో తానెందుకు చప్పులను ధరిస్తున్నానో విజయ్ వివరించాడు.
`నాకు ఆ టైమ్లో ఏది నచ్చితే అదే ధరిస్తాను. అది నా ఇష్టం. బ్రాండ్తో సంబంధం లేకుండా అన్నిరకాల వస్తువులను ఇష్టపడతాను. అంతేకాకుండా సినిమా రిలీజ్కి ఎక్కువ టైం కూడా లేదు. ప్రతి రోజు ఒక డ్రెస్, దానికి మ్యాచ్ అయ్యే షూల కోసం వెతుక్కోవడానికి ఎక్కువ సమయం పడుది. అందుకే చప్పులు కొనుగోలు చేశా. వాటి వల్ల నా డ్రెస్సింగ్కి ఎక్కువ సమయం పట్టడం లేదు. అయినా ప్రమోషన్స్కి ఇలా చెప్పులేసుకొని వెళ్లడం వల్ల ఎవరేమనుకుంటారో అని పట్టించుకోను. ఎవరేమనుకున్నా నాకు పర్లేదు.`అంటూ విజయ్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి.