టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవకొండ గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. `గీత గోవిందం` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హిట్టు ముఖమే చూడని విజయ్.. రీసెంట్గా `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
ఆగస్టు 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ భారీతనం, యాటిట్యూడ్ కథలు పక్కనపెట్టి ప్రేమకథలపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయినట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. అల్రెడీ ఈయన చేతిలో `ఖుషి` అనే లవ్ స్టోరీ ఉంది.
శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. అయితే విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో నిజం లేదట. దిల్ రాజు విజయ్ కోసం ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిని ఫైనల్ చేశారట.
రొమాంటిక్, లవ్, ఎంటర్టైనర్ సినిమాలను రూపొందించడంలో మోహనకృష్ణ ఇంద్రగంటి మహా దిట్ట. ఈ నేపథ్యంలోనే విజయ్ తో కూడా ఓ లవ్ ఎంటర్టైనర్ను తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ప్రేమ కథలను నమ్ముకుంటున్న విజయ్.. ఇలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!