`లైగర్` మరో వారం రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో అట్టహాంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రమిది. ఇందులో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.
బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్ తో కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ నిర్మించారు. ఆగస్టు 25న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో గ్రాండ్గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. `లైగర్`కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలను బయటపెట్టారు. అయితే ఈ క్రమంలోనే `లైగర్ కి సీక్వెల్ ఉంటుందా..?` అనే ప్రశ్న ఆయనకు ఎదురైంది.
అందుకు విజయ్ దేవరకొండ బదులిస్తూ.. ఉండొచ్చని బదులిచ్చారు. కానీ ఇప్పుడే సీక్వెల్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని, ‘లైగర్’ సినిమా గనుక భారీ హిట్ అయితే తప్పకుండా సీక్వెల్ ఆలోచన వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.