పాన్ ఇండియా స్థార్ విజయ్ దేవరకొండ రీసెంట్గా `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
అయితే ఈ మూవీ విడుదలకు ముందే విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేశాడు. అదే `జనగణమన`. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక అయింది. ముంబైలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. కానీ, ఇప్పుడు `లైగర్`కు వచ్చిన రిజెక్ట్ కారణంగా.. పూరీని, ఆయన ప్రాజెక్ట్ను కొన్నాళ్లు పక్కన పెట్టాలని విజయ్ డిసైడ్ అయినట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ ను `ఖుషి`పైనే పెట్టాలని.. ఈ సినిమానే తనను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని విజయ్ దేవరకొండ బలంగా భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఖుషి మూవీలో విజయ్ కు జోడీగా సమంత నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మిస్తుండగా.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
కశ్మీర్ బ్యాక్ డ్రాప్లో విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. మరి ఈ మూవీతో అయినా విజయ్ హిట్ అందుకుంటాడో..లేదో.. చూడాలి.