టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 25న తెలుగులో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. విజయ్ కూడా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బజ్ ను పెంచుతున్నాడు. ఇలాంటి తరుణంలో విజయ్కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. రీసెంట్గా ఈయన ఓ హిట్ మూవీని మిస్ చేసుకున్నాడట.
ఇంతకీ ఆ మూవీ మరెదో కాదు.. `సీతారామం`. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ క్లాసిక్ లవ్ స్టోరీ ఇది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్రను పోషించింది. ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ.. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఈ సినిమా చూసిన తరువాత సీతారాములుగా దుల్కర్, మృణాల్ లను తప్ప మరొకరిని ఊహించుకోలేం. అంతలా తమ నటనతో వారిద్దరూ ఆకట్టుకున్నారు. కానీ, ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. దుల్కర్ కంటే ముందు ఈ మూవీ కథ విజయ్ దేవరకొండ వద్దకు వెళ్తే ఆయన రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని హను స్వయంగా తెలిపారు. `సీతారామం` కథను విజయ్ దేవరకొండతో పాటు మరో స్టార్ హీరోకి కూడా చెప్పానని ఫైనల్ గా దుల్కర్ తో సెట్ అయిందని ఆయన వెల్లడించారు. దీంతో `సీతారామం` వంటి హిట్ మూవీని విజయ్ వదులుకున్నందుకు అతడి అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!