టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు కావాల్సినంత క్రేజ్, ఫ్యాన్ ఫాలింగ్ ఉన్న సక్సెస్ మాత్రం లేదు. గీతా గోవిందం తర్వాత విజయ్ హిట్ ముఖమే చూడలేదు. రీసెంట్గా ఈయన నటించిన లైగర్ సైతం బాక్పాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. విజయ్ కెరీర్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
భారీ అంచనాలు నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ చూపులన్నీ ఖుషి పైనే ఉన్నాయి. అభిమానులు సైతం ఈ సినిమాతో విజయ్ హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఆశపడుతున్నారు. శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే యాబై శాతానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.
డిసెంబర్ 23న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆ తేదీకి ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా సమంత తాజాగా `మైయోసిటిస్ ఆటో ఇమ్యునో డిజార్డర్` అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చికత్స తీసుకుంటోంది.
సమంత పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో షూటింగ్లో పాల్గొనే ఛాన్సులు కనిపించడం లేదు. సమంత కారణంగా ఖుషి షూటింగ్ మరింత ఆలస్యం అవ్వబోతోంది. అసలే ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి ప్రేక్షకులకు ముందుకు రావడానికి విజయ్ ఆశపడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఆశలు గల్లంతు అయ్యాయి. ఈ విషయంలో అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ఇక చేసేదేమీ లేక సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
https://newsorbit.com/cinema/vijay-devarakonda-change-his-name-in-social-media.html
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!