Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటిస్తున్నారు.
రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండగా.. మొదటి పార్ట్ ను`పుష్ప ది రైస్` టైటిల్తో గత ఏడాది డిసెంబర్లో విడుదల చేశారు. ఈ మూవీ మొదట నెగటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత భారీ కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో ఇప్పుడు అందరి చూపులు పార్ట్-2 అయిన `పుష్ప ది రూల్`పై పడ్డాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
త్వరలోనే సుకుమార్ సెకెండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ను షురూ చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నారట.
నిజానికి విలన్గా చేస్తున్న ఫహాద్ ఫాజిల్ పాత్ర కోసం మొదట విజయ్ సేతుపతినే సంప్రదించారు. కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన పార్ట్ 1కు నో చెప్పారు. అయితే `పుష్ప 2`కి మరింత హైప్ తీసుకుని రావడానికి సుకుమార్.. విజయ్ సేతుపతి కోసం ఓ కీలకమైన పాత్రను డిజైన్ చేసి ఆయన్ను అప్రోచ్ అయ్యారట. రోల్ నచ్చడం, అన్ని అనుకూలంగా ఉండటంతో ఆయన వెంటనే ఓకే చెప్పాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.