తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో `వారసుడు(తమిళంలో వరిసు)` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇందులో భాగంగానే మేకర్స్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారట.
జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అదే రోజు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రత్ కాంబినేషన్లో తెరకెక్కించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్` విడుదల కాబోతోంది. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
అయితే ఆదిపురుషుడితో పోటీగా వారసుడు కూడా దిగిబోతున్నాడని తాజాగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే సంక్రాంతి పోరులో బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ ఖాయమని సినీప్రియులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.