Virata Parvam: దగ్గుబాటి రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `విరాట పర్వం`. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్గా నటించగా.. ప్రియమణి, నందితాదాస్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు. నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న రూపుదిద్దుకున్న ఓ చక్కటి ప్రేమ కథ ఇది.
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఆ చిత్రం జూన్ 17న విడుదలై.. పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించడం లేదు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రెండో రోజు రూ. 63 లక్షల షేర్తో సరిపెట్టుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలాగే వరల్డ్ వైడ్గా రెండో రోజు రూ. 85 లక్షల రేంజ్లో షేర్ను వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా విరాట పర్వం 2 డేస్ టోటల్ కలెక్షన్స్ను ఓ సారి గమనిస్తే..
నిజాం: 0.82 కోట్లు
సీడెడ్: 0.12 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.14 కోట్లు
తూర్పు: 0.11 కోట్లు
పశ్చిమ: 0.8 కోట్లు
గుంటూరు: 0.11 కోట్లు
కృష్ణ: 0.9 కోట్లు
నెల్లూరు: 0.6 కోట్లు
——————–
ఏపీ+తెలంగాణ=1.53కోట్లు(2.50 కోట్లు~ గ్రాస్)
——————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.20 కోట్లు
ఓవర్సీస్: 0.54 కోట్లు
——————–
వరల్డ్ వైడ్ కలెక్షన్= 2.27 కోట్లు(3.90కోట్లు~ గ్రాస్)
——————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 14 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. దీంతో ఈ మూవీ క్లీన్ హిట్గా నిలవాలంటే మొదటి రెండు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 12.23 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంటుంది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను రీచ్ కావాలంటే ఇప్పుడున్న జోరు సరిపోదనే అంటున్నారు.