Virata Parvam: విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `విరాట పర్వం`. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, నందితాదాస్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషించారు.
1992లో వరంగల్కు చెందిన సరళ అనే మహిళను మావోయిస్టులు కాల్చి చంపడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సంఘటనను ఆధారంగా తీసుకుని.. ఓ చక్కటి ప్రేమ కథగా ఈ మూవీని రూపొందించారు. గత ఏడాదే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. అనేక అడ్డంకులను దాటుకుని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంత జోరు చూపించడం లేదు. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో కంప్లీట్ గా నిరాశ పరిచిన ఈ చిత్రం.. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్గా రూ. 1.42 కోట్ల షేర్ను రాబట్టి రానా ఓకే అనిపించాడు. ఇక ఏరియాల వారీగా విరాటపర్వం ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ను ఓసారి గమనిస్తే..
నిజాం: 0.48 కోట్లు
సీడెడ్: 0.7 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.8 కోట్లు
తూర్పు: 0.6 కోట్లు
పశ్చిమ: 0.5 కోట్లు
గుంటూరు: 0.7 కోట్లు
కృష్ణ: 0.5 కోట్లు
నెల్లూరు: 0.4 కోట్లు
——————–
ఏపీ+తెలంగాణ=0.90కోట్లు(1.50కోట్లు~ గ్రాస్)
——————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.12 కోట్లు
ఓవర్సీస్: 0.40 కోట్లు
——————–
వరల్డ్ వైడ్ కలెక్షన్= 1.42కోట్లు(2.50కోట్లు~ గ్రాస్)
——————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 14 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడీ మూవీ క్లీన్ హిట్గా నిలవాలంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 13.08 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంటుంది.