Virata Parvam: దగ్గుబాటి రానా, సహజ నటి సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రమే `విరాట పర్వం`. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
నక్సలిజం నేపధ్యంలో రూపుదిద్దుకున్న ఓ చక్కటి ప్రేమ కథనే విరాటపర్వం. అనేక వాయిదాల అనంతరం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం.. మంచి స్పందనను దక్కించుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి నటన అద్భుతంగా ఉందంటూ ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించారు. అయితే అంతా బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ కలెక్షన్స్ను రాబడుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 లక్షలు, రెండో రోజు 63 లక్షల షేర్ను వసూల్ చేసిన ఈ చిత్రం.. మూడో రోజు రూ. 50 లక్షల షేర్తో సరిపెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 14 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 14.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే ఈ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ మూవీ రూ. 3.14 కోట్ల షేర్ను మాత్రమే దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ క్లీన్ హిట్గా నిలవాలంటే మొదటి మూడు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 11.36 కోట్ల షేర్ను రాబట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఏరియాల వారీగా విరాట పర్వం 3 డేస్ టోటల్ కలెక్షన్స్ను ఓ సారి గమనిస్తే..
నిజాం: 1.11 కోట్లు
సీడెడ్: 0.17 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.20 కోట్లు
తూర్పు: 0.15 కోట్లు
పశ్చిమ: 0.11 కోట్లు
గుంటూరు: 0.15 కోట్లు
కృష్ణ: 0.12 కోట్లు
నెల్లూరు: 0.8 కోట్లు
——————–
ఏపీ+తెలంగాణ=2.09కోట్లు(3.40 కోట్లు~ గ్రాస్)
——————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.25 కోట్లు
ఓవర్సీస్: 0.80 కోట్లు
——————–
వరల్డ్ వైడ్ కలెక్షన్= 3.14 కోట్లు(5.35కోట్లు~ గ్రాస్)
——————–