Virata Parvam OTT Release: రానా దగ్గుబాటి, సాయి పల్లవి తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `విరాట పర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించారు. నందితాదాస్, ప్రియమణి, నవీన్చంద్ర తదితరులు ఈ మూవీ ముఖ్య పాత్రలను పోషించారు.
గత ఏడాడే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. వాయిదా పడుతూ పడుతూ చివరాఖరకు నిన్న గ్రాండ్గా విడుదలైంది. నక్సలిజం బ్యాక్డ్రాప్లో ఓ అందమైన లవ్స్టోరీని ఆవిష్కరించడం విరాటపర్వం స్పెషల్. 1992లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
ముఖ్యంగా సాయి పల్లవి నటన అద్భుతం అంటూ ఆమె ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. `విరాటపర్వం` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో విరాట పర్వం ఓటీటీ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. జూలై మూడో వారంలో నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యే ఛాన్సులు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…