మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన `ఉప్పెన` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్.. తొలి సినిమాతోనే ఎన్ని సంచలనాలను సృష్టించాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
ఓ చిన్న సినిమాగా విడుదలైన `ఉప్పెన` పెద్ద విజయం సాధించి భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా తర్వాత వైష్ణవ్ కెరీర్ అంత సాఫీగా ముందుకు సాగడం లేదు. వైష్ణవ్ నటించిన రెండో చిత్రం `కొండపొలం`. స్టార్ డైరెక్టర్ క్రిష్ ఈ మూవీ తెరకెక్కించగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్గా వైష్ణవ్ తేజ్ `రంగ రంగ వైభవంగా` మూవీతో వచ్చాడు. గిరీశాయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అయితే `ఉప్పెన` తర్వాత వైష్ణవ్కు వరుస ఫ్లాపులు పడటం వెనక కారణం కథ ఎంపికలో పొరపాట్లే అని అంటున్నారు.
`ఉప్పెన` సినిమా కథను తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి విని ఒకే చేసిన తర్వాతే వైష్ణవ్ చేశాడు. కానీ, ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాల విషయంలోనూ చిరు తలదూర్చలేదట. కట్ చేస్తే రెండు సినిమాలు ఫ్లాపే అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ ఇకపై కథల ఎంపికలో చిరంజీవి సలహాలు తీసుకుంటే బెటర్ అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కెరీర్ పూర్తిగా డౌన్ అయ్యే అవకాశాలు సైతం ఉంటాయని అంటున్నారు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!